లక్నో : యూపీలోని బాగ్పట్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. టీ ఇవ్వాలని భార్యను అడగడంతో ఆగ్రహానికి లోనైన మహిళ భర్త కంట్లో కత్తెరతో పొడిచి ఆపై ఘటనా స్ధలం నుంచి పరారైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్కు మూడేండ్ల కిందట వివాహమైంది. పెండ్లయినప్పటి నుంచి భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఘటన జరిగే మూడురోజుల ముందు అంకిత్ భార్య అతడితో పాటు కుటుంబసభ్యులపై తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అంకిత్ తనకు టీ ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆగ్రహానికి లోనైన భార్య అతడి కంట్లో కత్తెరతో పొడిచింది. అంకిత్ కేకలు వేయడంతో అతడి వదిన పిల్లలు బయటకు వచ్చారు.
అంకిత్ రక్తమోడుతుండటంతో భయపడిన భార్య ఘటనా స్ధలం నుంచి పరారైంది. పోలీసులు అంకిత్ను ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి ఆపై మెరుగైన చికిత్స కోసం మీరట్కు తరలించారు. మహిళను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read More :
Vijayakanth | కెప్టెన్ను వెంటాడిన డయాబెటిస్.. మూడు వేళ్లు తొలగింపు