అహ్మదాబాద్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఉదంతం గుజరాత్ లోని షిహోర్ పట్టణంలో వెలుగుచూసింది. గత ఏడాదిగా 19 ఏండ్ల కుమార్తెపై కన్నతండ్రే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో ప్రభుత్వ దవాఖానలో బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు తండ్రి ఎవరని అడగ్గా తండ్రి నిర్వాకాన్ని వెల్లడించడంతో స్దానికులు విస్తుపోయారు.
దినసరి కూలీగా పనిచేసే తండ్రి ఏడాది కాలంగా తల్లి ఇంట్లో లేని సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత బాలిక వాపోయింది. పోలీసులు కీచక తండ్రిని అదుపులోకి తీసుకుని బాలిక, బిడ్డను భావనగర్ వైద్య కేంద్రానికి తరలించారు. నిందితుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా ఇద్దరు కొడుకులు, కుమార్తెకు వివాహమై వేరుగా ఉంటున్నారు. షిహోర్ పట్టణంలోని మురికివాడలో భార్య, చిన్నకూతురితో కలిసి నిందితుడు ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.