నిజామాబాద్ : జిల్లాలోని వర్నీ రోడ్డు చౌరస్తాలో అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఆటో హారన్ కొట్టారని ఇద్దరిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. అనంతరం దుండగులు పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.