ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి గుర్తు తెలియని మృతదేహంతో తీవ్ర కలకలం రేగింది. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ట్స్కళాశాల రైల్వేస్టేషన్ సమీపంలోని పాడుపడిన క్వార్టర్స్లో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కనీసం ఇరవై రోజుల కింద ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. మృతుడు పరిసర ప్రాంతాల్లో చెత్త ఏరుకునే భిక్షగాడిగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.