train collision
కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (30) విద్యానగర్-కాచిగూడ రైల్వేస్టేషన్ మధ్య తిలక్నగర్ బ్రిడ్జి సమీపంలో పట్టాల దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై కాకి రంగు చొక్క, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ఉన్నట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి వివరాలు తెలిసిన వారు 8106801989లో సంప్రదించాలని కోరారు.