ఇటీవలి కాలంలో మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఉబెర్, ఓలా, ర్యాపిడో వంటి సర్వీసులపై ఆధారపడుతున్నాం. ఒక్కోసారి ఇవి వాడటం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా నికితా జైన్ మహమ్మద్ అబుజార్ చౌదరి అనే ఇద్దరు జర్నలిస్టులకు ఇలాంటిదే ఒక భయంకరమైన అనుభవం ఎదురైంది.
వీళ్లిద్దరూ అస్సాంలో కమాఖ్యా నుంచి గువాహతికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. కారు ఎక్కిన తర్వాత పేమెంట్ క్యాష్ కావాలని డ్రైవర్ అన్నాడు. తాము ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నామని, రైడ్ మొదలైన తర్వాత దాన్ని మార్చడం కుదరదని చౌదరి చెప్పాడు. దాంతో కారు ఆపేసిన డ్రైవర్ గొడవకు దిగాడు.
‘‘ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నామని గొడవ చేసి రాడ్డుతో చౌదరి గారిపై దాడి చేశాడు. ఆ తర్వాత కారుతో ఆయన్ను తొక్కించేయడానికి ప్రయత్నించాడా డ్రైవర్. చివరగా మమ్మల్ని బంగ్లాదేశీ అని పిలుస్తూ దారుణంగా ప్రవర్తించాడు’’ అని నికితా జైన్ ట్వీట్ చేసింది.
ఇది చూసిన గువాహతి పోలీస్ కమిసనర్.. తాము ఈ కేసుపై దృష్టి పెడతామని చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఉబెర్ ఇండియా కూడా దీనిపై స్పందించింది. సదరు రైడ్ బుక్ చేసుకున్న ఖాతా వివరాలు తమకు పంపాలని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Here is how the driver tried to run over @MohdAbuzarCh @Uber_India https://t.co/gl4XN2pclT pic.twitter.com/p7cz6KwqdH
— Asad Ashraf (@Asad_Ashraf88) May 28, 2022