అమరావతి : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రోడ్డు పై నిల్చున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సంతగుడిపాడుకు చెందిన నామాల రాజశేఖరరెడ్డి (22) అనే యువకుడుతో పాటు లారీ క్లీనర్ బిల్లా కోటేశ్వరరావు(46) మృతి చెందారు. లారీ డ్రైవర్ కొల్లాబత్తుల రాజేశ్కు తీవ్రగాయాలయ్యాయి.
టీ తాగేందుకు రోడ్డుపై లారీ నిలిపి లారీని శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.