హైదరాబాద్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కుమ్రంభీం చౌక్ వద్ద వాహనంపై ప్రమాదవశాత్తు చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ బుచ్చిరాం (45), రవి (35) ప్రాణాలు కోల్పోయారు. నిఖిల్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నది. ఘటనలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా ఇటిక్యాల నుంచి కుంటాల జలపాతానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.