అమరావతి: కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామ సమీపంలో కోసిగి క్రాస్ రోడ్డు దగ్గర మోటారు సైకిల్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామనికి చెందిన వారిగా గుర్తించారు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.