అమీర్పేట్ : ఊరికి వెళుతున్న సోదరుణ్ణి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వదిలేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు ఎర్రగడ్డలో ఇసుక లారీ ఢీకొనడంతో మృతిచెందారు. మృతులు ఇద్దరు త్రిపుర రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
త్రిపుర రాష్ట్రానికి చెందిన సుమన్ (24), బప్పి దిపరమ (22)లు కూకట్పల్లిలో నివాసముంటున్నారు. సుమన్ సోమవారం ఉదయం నాలుగు గంటలకు సికింద్రాబాద్ నుండి ట్రైన్లో తన సొంత రాష్ట్రానికి వెళ్ళాల్సి ఉండడంతో రైల్వేస్టేషన్లో డ్రాఫ్ చేసేందుకు బప్పి దిపరమ ఉదయం 3.30 గంటలకు ద్విచక్ర వాహనంపై సుమన్తో కలిసి కూకట్పల్లిలోని తమ నివాసం నుండి బయలుదేరారు.
అయితే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద ఇటుక లోడ్తో ఉన్న లారీ వేగంగా దూసుకు వస్తూ వీరి వాహనాన్ని ఢీకొంది. తీవ్ర గాయాలకు గురైన వీరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారకుడైన లారీ డైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.