బెంగళూర్ : రూ కోటి విలువైన డ్రగ్స్తో పట్టుబడిన ఇద్దరు ఇరానియన్లు సహా నలుగురు వ్యక్తులను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ చేరవేస్తున్నారనే సమాచారంతో ఓ కారును అడ్డగించిన పోలీసులకు అందులో రూ కోటి విలువైన డ్రగ్స్ను తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. స్కూల్, కాలేజ్ విద్యార్ధులు టార్గెట్గా వారు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది.
నగర శివార్లలోని బిదాడి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వారు ఈ అక్రమ దందాకు తెరలేపారు. పట్టుబడిన ఇద్దరు ఇరానియన్లు గతంలోనూ రెండు సార్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాగా తాజాగా మూడోసారి పట్టుబడ్డారు. వారి వీసాల గడువు ముగిసినా ఇంకా ఇక్కడే ఉన్నారని పోలీసులు తెలిపారు.