Summer Special Trains | వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పెద్ద ఎత్తున ప్రత్యేక రైలు సర్వీసులు నడుపనున్నది. ఇందులో భాగంగా విశాఖపట్నం-బెంగళూరు మధ్య 20 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 30 వరకూ శని, ఆదివారాల్లో మాత్రమే ఈ సర్వీసులు అందుబాుటో ఉంటాయని ఎస్సీఆర్ వెల్లడించింది.
విశాఖపట్నం నుంచి ఈ నెల 27 మధ్యాహ్నం 1.15 గంలకు విశాఖపట్నం – బెంగళూరు (08549) రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. అలాగే బెంగళూరులో ఆదివారం (ఏప్రిల్ 28) ఉదయం 8.50 గంటలకు బయలుదేరి మరునాడు తెల్లవారుజామున 3.10 గంలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, కృష్ణరాజపురం స్టేషన్ల మీదుగా ఈ సర్వీసులు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైలు సర్వీసుల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని ఎస్సీఆర్ అధికారులు చెప్పారు.