న్యూఢిల్లీ : పెండ్లి వేడుకలో అత్యుత్సాహంతో కాల్పులు జరుపుతూ సెలబ్రేటరీ ఫైరింగ్కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీలోని చత్తార్పూర్లో గురువారం జరిగిన ఓ పెండ్లి వేడుకలో సెలబ్రేటరీ ఫైరింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, లైవ్ క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అశ్వనికుమార్, పీయూష్ గౌతమ్లుగా గుర్తించారు. సెలబ్రేటరీ ఫైరింగ్లో 54 ఏండ్ల మహిళ గాయపడిందని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్కు ఏప్రిల్ 28న ఫోన్ కాల్ రావడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
చత్తార్పూర్ మందిర్లోని మాతంగి భవన్లో జరిగిన పెండ్లి వేడుకలో జరిగిన ఫైరింగ్లో గురుగ్రాంకు చెందిన మహిళకు గాయాలయ్యాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఘటన జరిగిన అనంతరం పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.