కృష్ణా : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం తోటవల్లూరు వద్ద కృష్ణా నదిలోకి పది మంది ఈతకెళ్లారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇద్దరి మృతదేహాలు గల్లంతు కాగా, మరొకరి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
మృతులను గోరిపార్తి శివనాగరాజు(20), గోరిపార్తి పవన్(18)గా పోలీసులు గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తిని నరేంద్రగా పోలీసులు నిర్ధారించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.