హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు మండలం రామానుజవారం పగిడేరు క్రాస్ రోడ్డు సమీపంలో బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పినపాక మండలం బయ్యారం ప్రయాణికులతో మణుగూరు వస్తున్నది. అదే సమయంలో మణుగూరు నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్కు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. బస్సు డ్రైవర్ బొల్లా రాంబాబు (55), ఎస్కే మన్నన్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో బస్లో ఉన్న ఎనిమిది
ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.