నల్లగొండ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పైనుంచి పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ శివారు ఎఫ్సీఐ గోదాముల వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఓ వ్యక్తి నల్లగొండ కలెక్టరేట్ నుంచి ఎఫ్సీఐ రోడ్డు మీదుగా టౌన్లోకి వస్తుండగా బర్రె అడ్డం రావడంతో పల్సర్ బైక్కు సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కింద పడిపోయారు.
బైక్పై ఉన్న ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.
కాగా, అటువైపు వెళ్తున్న నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగి వెంటనే అంబులెన్స్ పిలిపించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు పంపించారు. డాక్టర్లతో మాట్లాడి గాయాలైన వారికి వెంటనే తగిన చికిత్స చేయాల్సిందిగా కోరారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.