అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
కనిగిరిలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల వివరాలు గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి