సైదాబాద్ : సైదాబాద్ ఖాజాబాగ్లో అక్రమంగా వంటగ్యాస్ సిలిండర్ల నుంచి ఆటోలోకి గ్యాస్ను రీఫిల్లింగ్ చేస్తున్న ఇద్దరిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం మలక్పేట సర్కిల్-1 పౌరసరఫరాల శాఖ అధికారులు సీనియర్ ఇన్స్పెక్టర్ పి.గోవర్ధన్ రావు, జానియర్ అసిస్టెంట్ ప్రదీప్లకు ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని ఖాజాబాగ్ గుడిసెల్లో ఆటోలకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందింది.
దీంతో అధికారులు సైదాబాద్ పోలీసుల సహకారంతో గుడిసెల్లోకి వెళ్లి అక్రమంగా ఆటోలకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు సిలిండర్లను స్వాధీన పర్చుకున్నారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు చేసి విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ సుబ్బరామి రెడ్డి తెలిపారు.