హనుమకొండ : వరంగల్ పోలీసు కమిషనరేట్ ఈస్ట్జోన్ పరిధి ఖానాపూర్ మండలం బుధరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసు అరెస్ట్ చేసి, రూ.10వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్లో ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలు వెల్లడించారు.
బుధరావుపేటకు చెందిన ఎర్రబెల్లి అనిల్ గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ నిర్వహించేవాడు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో, అదే గ్రామానికి చెందిన మల్యాల భరత్తో కలిసి క్రికెట్ బెట్టింగ్ మొదలుపెట్టారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లపై అవగాహన ఉన్న యువకులతో కలసి, వీరిద్దరు బెట్టింగ్ నిర్వహించేవారు.
గెలిచిన వారి నుంచి 10శాతం కమీషన్ తీసుకునేవారు. ఈ నెల 26న బెట్టింగ్లో పాల్గొన్న యువకుడు డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితులు, అతడి ఇంటికి వెళ్లి బలవంతంగా బైక్ తీసుకొచ్చారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో అనిల్, భరత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.