భోపాల్ : రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారికిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకున్నది. రత్లాం జిల్లాలోని సత్రుండ గ్రామ సమీపంలోని రత్లాం – ఇండోర్ ఫోర్లైన్ రహదారిపై జరిగింది. టక్కు వేగంగా ఉండడం ఇదే సమయంలో ఒక్కసారిగా టైరు పగలిపోవడంతో అదుపు తప్పి అక్కడే బస్సు కోసం నిరీక్షిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వైద్య కళాశాలకు తరలించారు. రక్తపు మరకలతో, చెల్లాచెదురైనా మృతదేహాలతో సంఘటనా స్థలం మొత్తం భీతావహంగా మారింది. సత్రుండ కూడలి వద్ద కొందరు రోడ్డు పక్కన కూర్చొని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.
అదే సమయంలో అటువైపుగా హైవేపై వెళ్తున్న టక్కు అదుపు తప్పి వారిపై దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను రత్లాం ఆసుపత్రికి తరలించారు. పది మంది గాయపడ్డగా.. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ టక్కును వదిలి పరారయ్యాడు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.