విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం

మెదక్ : విహారం వారి పాలిట విషాదంగా మారింది. ప్రకృతి అందాలను తిలకించి పులకించాలన్నా వారి ఆశలు అడియాసలయ్యాయి. వారి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ముగ్గురు మృత్యు ఒడికి చేరారు. ఈ హృదయవిదారకర సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ పట్టణానికి చెందిన యువకులు సోఫిక్, జమీర్, సమీర్ పుల్కల్ మండలంలోని సింగూరు డ్యామ్ చూసేందుకు బయల్దేరారు.
మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా జమీర్, సమీర్ మృతి చెందారు. సోఫిక్ను హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సాగు చట్టాల కాపీలను తగులబెట్టిన రైతులు
తుపాకీ కాల్పుల్లో ఇండిగో మేనేజర్ మృతి
తాజావార్తలు
- మత్తడి ఎత్తును పెంచి సాగునీరందిస్తాం
- జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం
- కొత్త వేరియంట్లో లెక్సస్ ఫ్లాగ్షిప్ సెడాన్
- సత్వరమే సమస్యలు పరిష్కరించాలి
- కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్
- గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్
- రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
- ఐస్లాండ్ అమ్మాయి- గొల్లపల్లి అబ్బాయి
- ఆల్ది బెస్ట్ చిల్డ్రన్
- మారుతి కార్లు ప్రియం