అమరావతి : ఏపీలోని అనకాపల్లి(Anakapalli) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కె.కోటపాడు మండలం చంద్రయ్య పేటలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరు యువకులు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదం విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ తగిలి విద్యుదాఘాతంతో సురేష్, ఎర్రినాయుడు అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో గ్రామంలో పండుగ వేళ విషాదఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.