కుత్బుల్లాపూర్ : గాజులరామారం సర్కిల్లో టౌన్ప్లానింగ్ విభాగం ఏసీపీగా పని చేసి, ఇటివలే హన్మకొండకు బదీలీపై వెళ్లిన గణేష్ సోమవారం కరోనాతో మృతి చెందారు. గత 15 రోజుల నుంచి కోవిడ్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాజులరామారం సర్కిల్ పరిధిలో గత కొన్నేళ్ల నుంచి టౌన్ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా సేవలను అందించారు. ఆయన మృతి పట్ల కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిల్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.