నల్గొండ : నాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం వెళ్లి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నారు. గల్లంతైన యువకులు నల్గొండకు చెందిన నాగరాజు (39) వాచస్పతి (26), చంద్రకాంత్ (20) గుర్తించారు. ఉపనయనం కోసం పుష్కరఘాట్ కోసం యువకులు వచ్చారు. ఈ క్రమంలోనే ఘాట్లో స్నానాలు చేసేందుకు దిగి గల్లంతయ్యారు.