హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.