భోపాల్ : ఓ పటాకుల గోదాంలో పేలుడు జరగ్గా.. ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మొరెనాలో చోటు చేసుకున్నది. పేలుడు తీవ్రతతో భవనం కుప్పకూలింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డవారందరినీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం.. బన్మూర్నగర్లో జైత్పూర్ రోడ్డులో పటాకుల గోదాంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. అయితే, పటాకుల గోదామును అక్రమంగా నిర్వహిస్తున్నారని చంబల్ రేంజ్ ఐటీ రాకేశ్ చావ్లా తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని, ఏడుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.