చాదర్ఘాట్ : రోడ్డు దాటుతున్న ఓ మహిళ (57) ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం… సలీంనగర్ ప్రాంతానికి చెందిన కిరణ్ ఉపాధ్యాయ (57) పీవీఆర్ సినిమాల్ వద్ద రోడ్డు దాటుతుంది.
అదే సమయంలో నాదర్గుల్ కు చెందిన కరేన్ దయాకర్(19),బడంగ్పేట నివాసి దోమకొండ హర్షిత లు డ్యూక్ ద్విచక్రవాహనం పై మలక్పేట నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్తుండగా కిరణ్ ఉపాధ్యాయను ఢీకొట్టారు. దీంతో ముగ్గురు కిందపడంతో గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెనుక కూర్చున్న హర్షిత కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.