వెంగళరావునగర్ : నిషేధిత గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి రామ్ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం..
ఎస్ఆర్నగర్ బికేగూడలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం సమీపంలో ముగ్గురు వ్యక్తులు గంజాయి, హాష్ ఆయిల్ విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో గురువారం సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో ఎస్ఆర్ నగర్కు చెందిన బాలుడు (17) వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి, కొంపల్లికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ ఎండీ అక్రం రజా (25) వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి, కొంపల్లికి చెందిన డ్రైవర్ మంథని సాయి సుమంత్ (21) వద్ద నుంచి 205 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన గుట్టె బాబు వద్ద గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలుచేసి నగరంలో అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.