అమరావతి : కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం చెందారు. జిల్లాలోని దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతుండగా మహిళతో సహ ఇద్దరు బాలికలు ఈ ఘటనలో మృతి చెందారు. ఆదివారం సెలవు కావడంతో దొడ్డబళ్లపురలోని బంధువుల ఇంటికి రాగా సోమవారం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో హిందూపురానికి చెందిన ఇర్ఫాన (46), రుకియా(13), రాకియా ( 8) అనే బాలికలు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురి ఆసుపత్రికి తరలించారు.