అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు కర్ణాటక (Karnataka) లో ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. కర్ణాటకలోని మలసంద్రం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులను ఓ తల్లి మంటలో వేసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం రంగచేడు వాసులుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.