వనపర్తి : జిల్లా పరిధిలోని కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు దాటుతున్న గొర్లను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృతి చెందినట్టు ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి తెలిపారు. కర్నూల్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ గ్రామ సమీపంలోని చెరువులోకి నీళ్లు తాగడానికి తీసుకు వెళ్తున్న గొర్రెలను ఢీ కొట్టిందని కాపరి జంపన్న తెలిపారు. మరో 20 గొర్రెలు గాయపడ్డాయని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి