హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బుధవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని భరత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లోకి దొంగలు ప్రవేశించారు. తలుపులు తెరుచుకొని నిద్రిస్తున్న ఓ మహిళపై దొంగలు దాడికి పాల్పడ్డారు. స్పందన(23) అనే మహిళ గొంతు కోసం పరారీ అయ్యారు.
బాధితురాలిని తన భర్త ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. స్పందన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.