హత్నూర/సంగారెడ్డి : కేబుల్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసిన సంఘటన హత్నూర మండలం నస్తీపూర్లో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం మేరకు.. పటాన్ చెరు పట్టణానికి చెందిన నిందితులు నర్సింలు, శ్రీనివాస్ గత కొన్ని రోజులగా వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లు దొంగతనం చేస్తున్నారు.
దీంతో బాధిత రైతులు వారిని దొంగతనం చేస్తుండగా పట్టుకొని దేహశుద్ది చేయడంతోపాటు హత్నూర పోలీలులకు అప్పగించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు పాత నేరస్తులని, పలు కోణాల్లో ధర్యాప్తు జరుపుతున్నట్లు హత్నూర పోలీసులు తెలిపారు.