శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్కు చెందిన కుమారస్వామి శంకర్పల్లిలోని 14వ వార్డు సాయినగర్లో నివాసం ఉంటున్నారు. కాగా 4రోజుల క్రితం కుమారస్వామి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి తీర్థయాత్రకు బయలు దేరారు. యాత్ర ముగించుకొని శనివారం వేకువ జామున 3-30ని.ల ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉండడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి పోలీసులతో పాటు వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 20తులాల బంగారం, కిలో వెండి, రూ. 4లక్షల 20వేల నగదును దొంగలు అపహరించనట్లు తెలిపారు. కాగా కాలనీలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించేందుకు వీలు లేకుండా పోయిందని సీఐ పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.