సారపాక : సారపాకలోని సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పూజారి వెంకటేశ్వరరావు ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీ పగలగొట్టి నగదుతోపాటు డీజే బాక్సులకు సంబంధించిన రూ.25వేల విలువైన సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీ జరిగిన విషయాన్ని గురించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా గతంలో పలుమార్లు ఆలయంలో చోరీ జరిగిందని, దీనిపై బూర్గంపహాడ్ పోలీసులు సైతం చోరీ చేసిన వారిని పట్టుకుని ఆకతాయిలుగా గుర్తించారని తెలిపారు. రాత్రి సమయంలో ఆకతాయిలు ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి మద్యం సేవిస్తున్నారని, దీనిపై పోలీసులు దృష్టి సారించి చోరీలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.