శంషాబాద్ : ఓ కిరాణా దుకాణంలో చోరి జరిగిన ఘటన ఆదివారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ లోని రాళ్లగూడ రోడ్డుపై ఉన్న విఠల్ కిరాణాదుకాణం దారులు రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లి పోయారు. ఉదయం వచ్చి చూడగా గుర్తు తెలియని దుండగులు షట్టర్ తాళాలు పగలగొట్టి కిరాణా సామాన్లు చోరి చేసుకొని పరారైరయ్యారు. సుమారు 3 లక్షల విలువ చేసే సరుకులు చోరి జరిగిఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.