పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్నగర్లో నివాసముంటున్న రాధిక(19) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది.
ఈనెల 5న ఉదయం 4 గంటలకు తల్లి నిద్రలోంచి లేచి చూడగా కూతురు రాధిక కనిపించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకి లభించలేదు. తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.