సైదాబాద్ :పని నిమిత్తం ఇంట్లోనుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. సింగరేణికాలనీకి చెందిన వి.రాధిక(17) పని నిమిత్తం ఈనెల 10న బయటికి వెళ్లింది. అప్పటినుంచి రాధిక ఇంటికి తిరిగి రాలేదు. బంధువులవద్ద వెతికినప్పటికీ ఆఛూకీ లభించకపోవడం తో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.