బండ్లగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను సరిగా చూసుకోవడం లేదని భర్తకు వీడియో కాల్ చేసి ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాలప్రకారం రాజమండ్రికి చెందిన నాగదేవి, హైదరాబాద్కు చెందిన సాయిశివ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న విషయం సాయిశివ తన తల్లిదండ్రులకు చెప్పకుండా నాగదేవితో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చైతన్య విలాస్ క్షేత్ర హోమ్స్లో ఉంటున్నారు. సాయిశివ బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వారంలో రెండు రోజు లు నాగదేవి వద్దకు వచ్చి వెళ్లేవాడు. నాగదేవి స్థానికంగా బ్యూటీ పార్లర్లో పని చేస్తుంది. ఇటీవల వారి పెళ్లి విషయం సాయిశివ వారి ఇంట్లో తెలుపాలని నాగదేవి ఒత్తిడి తేవడంతో పాటు తనను ఇంట్లో వారికి పరిచయం చేయాలని కోరింది.
ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నాగదేవి.. సాయిశివకు వీడియోకాల్ చేసి ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.