శంషాబాద్ రూరల్:షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వ్యాన్ అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొని బోల్తాపడడంతో 15 మందికి స్వల్పగాయాలైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పచ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన 15 మంది కూలీలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్లో వరినార్లు వేయడానికి వచ్చారు.
తిరిగి వెళ్తుండగా షాద్నగర్ వైపు నుంచి శంషాబాద్ వైపు వస్తున్న తరుణంలో మండలంలోని పెద్దషాపూర్ వద్దకు రాగానే వ్యాన్ అదుపుతప్పి డివైడర్ను డీకొంది. ప్రమాదంలో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూలీలను శంషాబాద్లోని ఓ ప్రైయివేటు దవాఖానలో చికిత్స చేయించి తిరిగి వారిని పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.