జోగులాంబ గద్వాల : పెండ్లి అయిన కొద్ది గంటలకే ఓ పెండ్లి కొడుకు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆవుల రాముడు కుమారుడు సూర్యబాబు (23) నిన్న మధ్యాహ్నం వివాహం జరగగా రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగా వివాహం చేసుకున్న వరుడు పెండ్లి అయిన కొన్ని గంటల తర్వాత మృతి చెందటంతో పలు అనుమానాలకు తావిస్తున్నది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వడ్డేపల్లి ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టరు. మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.