కొత్తూరు రూరల్ : ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని బండోనిగూడలో చోటుచేసుకుంది. ఎస్ఐ ధనుంజయ తెలిపిన కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని బండోనిగూడ గ్రామానికి చెందిన చిల్కూరి శ్రీను(33) అదే గ్రామానికి చెందిన జాలగూడెం శ్రీనుకు చెందిన ట్రాక్టర్పై పని ఉన్నప్పుడు రోజు వారి కూలీగా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం షాబాద్ మండలంలోని పెదవేడులో పొలం దున్నటానికి చిల్కూరి శ్రీను ట్రాక్టర్ను తీసుకుని వెళ్లాడు.
అక్కడ పనిని ముగించుకుని సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో బుగ్గోనిగూడ గ్రామం నుంచి బండోనిగూడ గ్రామం వైపు వెళ్లే మూలమలుపు వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. డ్రైవర్పై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన బండ యాదయ్య శ్రీను కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారాన్ని అందించటంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై మృతుడి బామ్మర్ది అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.