శంషాబాద్ రూరల్ : అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దోచర్ల చంద్రయ్య (67) బుధవారం గుండెపోటుతో చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు స్థానికులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా చంద్రయ్య మొఖంపై దాడిచేసినట్లు గాయాలు ఉన్నాయి. బట్టలపై రక్తం మరకలు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియాకు తరలించారు.
కాగా చంద్రయ్య మరణించిన సమయంలో కొడుకు ,కోడలు రమేష్, సంతోష ఇంట్లోనే ఉండడంతో వారి ఇద్దరిని ఆదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.