బంజారాహిల్స్ : ప్రమాదవశాత్తూ భవనం మీదనుంచి కిందపడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హకీంపేటలోని సనా హోటల్ సమీపంలో ఫలక్ ఫంక్షన్ హాల్లో బీహార్కు చెందిన రియాజ్ అలియాస్ గోరా(25) అనే వ్యక్తి గత అరునెలలుగా పనిచేస్తున్నాడు.
ఫంక్షన్ హాల్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు వచ్చి వెయిటర్గా పనిచేస్తుండే రియాజ్ ఈ నెల 3న రాత్రి మద్యం సేవించి ఫంక్షన్ హాల్లో నిద్రపోతానంటూ వచ్చాడు. అర్థరాత్రి దాటిన తర్వాత రియాజ్ ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందపడి మృతి చెందాడు.
గురువారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు యజమాని మహ్మద్ అఖీల్కు చెప్పారు ఈ మేరకు అఖీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.