జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నవాడే ఆమె పాలిట యముడయ్యాడు. అనుమానం పెనుభూతమై భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. ఈ విషాదకర సంఘటన భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు..గ్రామానికి చెందిన ఒల్లాల సమ్మయ్య తన భార్య శ్రీలత (27)పై అనుమానం పెంచుకున్నాడు. తనని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి గొడ్డలితో శ్రీలత మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.