రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలిక (కుట్టి )మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..కొల్లాపూర్కు చెందిన సన, జగదీష్ నాయక్ల కూతురు కుట్టి ఆడుకుంటూ వెళ్లి మూత తీసి ఉన్న సంపులో పడి మృతి చెందింది. బాలిక మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.