శంషాబాద్ రూరల్: గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన సంఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సుల్తాన్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో చిన్నతోట వద్ద సుల్తాన్పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానిక సర్పంచ్ దండుఇస్తారి సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియాకు తరలించారు. మృతుడి వయస్సు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని వంటిపై గీతల షర్టు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే శంషాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.