ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్కు ఆదిలాబాద్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
గతేడాది డిసెంబర్ 18న ఆదిలాబాద్ తాటిగూడ ప్రాంతంలో మున్సిపల్ వైస్ చైర్మన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్ చిన్న పిల్లల గొడవకు సంబంధించి ముగ్గురి పై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో గాయపడిన జమీర్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది.
సంవత్సరానికి పైగా కేసు విచారణ జరుగగా.. 26 మంది సాక్షులను పోలీసులు ప్రవేశపెట్టారు. సోమవారం వాదోపవాదనలు విన్న తర్వాత కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.