శ్రీనగర్ : కాశ్మీర్ డివిజన్లోని పుల్వామాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఉమ్మడి నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీస్ వీరమరణం చెందగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలయ్యాయి. వెంటనే సదరు జవాన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించి భద్రతా దళాలు, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు పుల్వామా జిల్లా పింగ్లానాలో సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు సంయుక్త బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
కాల్పుల్లో ఓ పోలీస్, జవాన్ గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పోలీస్ మృతి చెందాడు. జవాన్కు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. ఉగ్రవాదుల కోసం తనిఖీలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. ఇవాళ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని హతమార్చాయి. మృతుడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాదిని నసీర్ అహ్మద్ భట్గా గుర్తించినట్లు కశ్మీర్ ఏడీజీపీ విజయ్కుమార్ తెలిపారు.