Road Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా భక్తులు వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. నాసిక్-షిర్డీ జాతీయ రహదారిపై పతారె వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి ఉన్నారు. 17 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు.
Maharashtra | 10 people died and several others injured after a bus carrying Sai Baba devotees collided with a truck near Pathare on Nashik-Shirdi Highway: Nashik Police pic.twitter.com/Xel2Irb0vc
— ANI (@ANI) January 13, 2023